ePaper
Friday, August 21, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

📰 Generate e-Paper Clip

రఘునాథపల్లి, స్పాట్ వాయిస్ : హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై రఘునాథపల్లి మండలం కొమ్మల టోల్‌ప్లాజా సమీపంలో బుధవారం సాయంత్రం 3.30 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీస్ కానిస్టేబుల్ ధనంజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యక్తిగత పనిపై జనగామకు బైక్‌పై వెళ్తుండగా మార్గమధ్యలో కారు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మృతుడు ప్రస్తుతం అసంపర్తి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular