ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeతెలంగాణమంత్రి సీతక్క, ఎమ్మెల్యే రేవూరిని కలిసిన డిజిటల్ మీడియా యూనియన్ నేతలు

మంత్రి సీతక్క, ఎమ్మెల్యే రేవూరిని కలిసిన డిజిటల్ మీడియా యూనియన్ నేతలు

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, బ్యూరో : ఈనెల 16న ములుగు, పరకాల నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్ నాయకులు గురువారం మంత్రి సీతక్క, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ములుగులో మంత్రి సీతక్కను, హనుమకొండలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని కలిసి పలు అంశాలపై చర్చించారు.యూనియన్ అధ్యక్షుడు ఆరెల్లి కిరణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన నాగరాజు, కోశాధికారి పల్లె వంశీ, గౌరవ అధ్యక్షుడు గడ్డం కేశమూర్తి, గౌరవ సలహాదారు రాజేశ్వరరావు, సహాయ కార్యదర్శి నగేష్ గౌడ్ తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, డిజిటల్ మీడియా ప్రతినిధులకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించినట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular