స్పాట్ వాయిస్ భూపాలపల్లి: శాయంపేట మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నర్ర కుమారస్వామి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు బూర పైడిత రాజు, నర్ర విక్రమ్ గురువారం బీఆర్ఎస్లో చేరారు. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి సమక్షంలో వారు కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారు. గండ్ర దంపతులు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేయాలని సూచించారు.
