మల్హర్, స్పాట్ వాయిస్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొండంపేట గ్రామపంచాయతీ 6వ వార్డు సభ్యుడు కోడిశాల మల్లేష్ (ఆదివారం) ఉదయం అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందడంతో కొండంపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మల్లేష్ మృతి పట్ల గ్రామపంచాయతీ సర్పంచ్ బెల్లంకొండ జ్యోత్స్న సరీన్రావు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

