స్పాట్ వాయిస్, దామెర: దామెర మండలంలో అక్రమంగా మొరం తరలిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.పసరగొండ గ్రామంలోని బతుకమ్మ కుంట నుండి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా జేసీబీ సహాయంతో ఐదు ట్రాక్టర్లలో మొరం తరలిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేశారు.దామెర ఎస్సై కొంక అశోక్ తన సిబ్బందితో కలిసి వాటిని పట్టుకుని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అక్రమంగా మొరం తరలింపు.. ఐదు ట్రాక్టర్లు స్వాధీనం
RELATED ARTICLES

