స్పాట్ వాయిస్, దామెర: దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని ల్యాదేళ్ళ గ్రామానికి చెందిన కొలిపాక కుమారస్వామి (30), ట్రాలీ ఆటో డ్రైవర్, కొన్ని రోజులు గా గ్రామంలో చేపలు పడుతూ మద్యం సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా మద్యం తాగుతూ కుమారస్వామిని శనివారం భార్య స్రవంతి మందలించడంతో మనస్థాపానికి గురైనట్లు సమాచారం.దీంతో అతడు తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడి భార్య స్రవంతి ఫిర్యాదు మేరకు దామెర ఎస్సై కొంక అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

