ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి
స్పాట్ వాయిస్, కాజీపేట: కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్ గృహకల్ప సమీపంలో ఆదివారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట వైపు నుంచి టీఎస్ 03 ఈజీ 9580 నంబర్ గల ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ వ్యక్తి రాజీవ్ గృహకల్ప మూల మలుపు వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.సమాచారం అందుకున్న మడికొండ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

