
- పురాతన శివాలయం పునర్ నిర్మాణానికి
రూ. లక్ష విరాళం
స్పాట్ వాయిస్, శాయంపేట : హన్మకొండ జిల్లా శాయంపేట మాజీ జడ్పీటీసీ, మాజీ మండల వైస్ ప్రెసిడెంట్ వంగాల రమా దేవి నారాయణ రెడ్డి దంపతులు దాతృత్వం చాటారు. ఆధ్యాత్మిక సేవా భావం కలిగిన శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన వంగాల నారాయణ రెడ్డి రమాదేవి దంపతులు శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామానికి పురాతన రామలింగేశ్వర శివాలయం పునర్మాణ కోసం తొలిరోజు విరాళంగా రూ. 111116/- అంద జేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

