ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్రఘునాథపల్లిలో దొంగల బీభత్సం 

రఘునాథపల్లిలో దొంగల బీభత్సం 

📰 Generate e-Paper Clip

4 తులాలు బంగారం… 50తులాల వెండి చోరీ..

స్పాట్ వాయిస్,రఘునాథ్ పల్లి : హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిని అనుకొని ఉన్న జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామ శివారు కురుమ గూడెం శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఎండాకాలం కావడంతో మాల మల్లేష్ రాత్రి సమయంలో బిల్డింగ్ పైన పండుకున్నారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంట్లో చొరబడి.. నాలుగు తులాల బంగారం… పదివేల రూపాయలు నగదు.., 50తులాల వెండి దొంగలు ఎత్తుకెళ్లారు.

భయం భయంగా జనం 

వరుసగా దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళన గురవుతున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular