స్పాట్ వాయిస్, రఘునాథ్ పల్లి: బీఆర్ఎస్ లింగాల గణపురం మండల ఇన్చార్జ్గా రఘునాథపల్లి మండల మాజీ ఎంపీపీ, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ఇన్ చార్జ్ గా వై.కుమార్ గౌడ్ నియమిస్తూ మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఉత్తర్వులు జారీ చేశారు. బీఆర్ఎస్ లో కష్టపడే ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుందనడానికి వై కుమార్ గౌడ్ దక్కిన పదవే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కుమార్ గౌడ్ నియామకంతో రఘునాథపల్లి మండల బీఆర్ఎస్ కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. జగిత్యాల సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు వణుకు పుట్టిందని అన్నారు. గ్రామస్థాయిలో పార్టీని బలపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తానని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరిస్తూ పార్టీ సభ్యత నమోదును చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. తనపై నమ్మకంతో మండల ఇన్ చార్జ్ గా నియమించిన మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. కుమార్ గౌడ్ నియామకంపై మండల టోల్గేట్ అధ్యక్షుడు ఎండీ సమీర్ హర్షం వ్యక్తం చేశారు.

