ePaper
Thursday, May 14, 2026
ePaper
Homeఎడిటోరియల్హనుమకొండలో పోలీసుల వినూత్న ఆలోచన..

హనుమకొండలో పోలీసుల వినూత్న ఆలోచన..

📰 Generate e-Paper Clip

  • ఎండ నుండి రక్షణకు పరదాల ఏర్పాటు 

స్పాట్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ అశోక జంక్షన్ వద్ద పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సిఐ సీతా రెడ్డి ఆధ్వర్యంలో సిగ్నల్ వద్ద నిలబడే ప్రయాణికులు ఎండకు గురికాకుండా పరదాలు (షేడ్స్) ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది.

ప్రయాణికులకు ఉపశమనం

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో సిగ్నల్ వద్ద నిలబడే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత మరింతగా ఉండడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ట్రాఫిక్ సిఐ సీతా రెడ్డి, అశోక జంక్షన్ వద్ద ప్రయాణికుల కోసం పరదాలు కట్టించేలా చర్యలు తీసుకున్నారు.

వినూత్న ఆలోచనకు ప్రశంసలు

ఈ చర్యకు స్థానికులు, వాహనదారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు కేవలం రూల్స్ అమలు చేయడమే కాకుండా ప్రజల సౌకర్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని చోట్ల అమలు చేయాలి..

ఈ విధమైన సదుపాయాలను నగరంలోని ఇతర ముఖ్య కూడళ్లలో కూడా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ శాఖ మరిన్ని వినూత్న చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండ తీవ్రతను తగ్గించే దిశగా హనుమకొండ ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న ఈ చర్య ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular