స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై రఘునాథపల్లి మండల కేంద్రం వద్ద శనివారం సాయంత్రం ఓ యువకుడు మృతి చెందాడు. హనుమకొండ జిల్లా కాజీపేటకు చెందిన సోమ సురేందర్ (23) తిరుపతికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

