ఊరికి వెళ్తున్నారా… ఈ జాగ్రత్తలు తప్పనిసరి
రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్ రెడ్డి
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: వేసవి సెలవుల సందర్భంగా చాలామంది ప్రజలు తమ స్వగ్రామాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఇంటి భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని రఘునాథపల్లి సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
సూచనలు ఇవే..
👉ఇంటిని పూర్తిగా లాక్ చేసి వెళ్లాలి
👉పక్కింటి వారికి లేదా బంధువులకు సమాచారం ఇవ్వాలి
👉విలువైన నగదు, బంగారం బ్యాంక్ లాకర్లలో ఉంచాలి
👉సీసీ కెమెరాలు, అలారం సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి
👉ఇంటి బయట లైటింగ్ సరిపడా ఉండేలా చూడాలి
👉చెరువులు, కుంటలు, కాలువల వద్ద చిన్నారులు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
👉 ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా నియంత్రణ అవసరo.
వేసవి జాగ్రత్తలు..
👉ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున అవసరం లేని ప్రయాణాలు తగ్గించుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు తగినంత నీరు తీసుకోవాలి.
👉హీట్ స్ట్రోక్ నుంచి రక్షణ చర్యలు పాటించాలని రఘునాథపల్లి సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

