ఖానాపూర్లో ట్రావెల్స్ కారు ఢీ…
ఇద్దరు మృతి
స్పాట్ వాయిస్, నర్సంపేట: ఖానాపూర్ బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికంగా ట్రావెల్స్కు చెందిన ఓ కారు, డ్రైవర్ మద్యం మత్తులో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టూ వీలర్ను ఢీకొట్టింది.ఈ ఘటనలో టూ వీలర్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


