స్పాట్ వాయిస్, గణపురం : భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు విషాద ఘటన చోటుచేసుకుంది. లారీలను తనిఖీ చేస్తున్న సమయంలో ఇసుక లారీ ఆర్టీవో వెంకన్నను ఢీకొట్టి పై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

