యువకుడికి తీవ్ర గాయాలు..
స్పాట్ వాయిస్, రఘునాథ్ పల్లి: హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై నిడిగొండ సమీపంలోని పెట్రోల్ పంపు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని బైక్ పై వెళ్తున్న ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దామెర కుమార్ (30) పని నిమిత్తం బైక్ పై వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

నిడిగొండ సమీపంలో రోడ్డు ప్రమాదం
RELATED ARTICLES

