స్పాట్ వాయిస్, హన్మకొండ: నగరంలోని వంద ఫీట్ల రోడ్డు, వడ్డెపల్లిలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సబ్ రిజిస్టర్ ఆనంద్ చాంబర్లో రికార్డులు పరిశీలిస్తున్నారు. ఇటీవల రిజిస్ట్రేషన్ కార్యాలయంపై తీవ్ర అవినీతి ఆరోపణలు సైతం వచ్చాయి. ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో రెండు బృందాలు ఆఫీస్లోని ఫైళ్లను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. ఈ సోదాలకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

