చిల్పూర్ గుట్టలో ఎమ్మెల్యే కడియంకు బిఆర్ఎస్ నేతల స్వాగతం
మళ్లీ మొదలైన కాంగ్రెస్…. బీఆర్ఎస్ ఫ్లెక్సీ వార్…..
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి : జనగామ జిల్లా స్టేష న్ ఘన్పూర్ నియోజకవర్గం చిల్పూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మళ్ళీ భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు స్వాగతం సుస్వాగతం అంటూ నినాదాలు చేయడామె కాకుండా ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎలాంటి సంఘటన జరగకుండా ముందస్తుగా వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు స్పీకర్ వద్ద కడియం శ్రీహరికి లైన్ క్లియర్ కావడంతో మళ్లీ ఫ్లెక్సీలతో స్వాగతం పలకడం మొదలైంది.
ఏసీపీ. భీమ్ శర్మ ఆధ్వర్యంలో. రఘునాథపల్లి సిఐ శ్రీనివాస్ రెడ్డి. వేణు. సబ్ ఇన్స్పెక్టర్లు 80 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛన్య అనే సంఘటన జరగకుండా ముందస్తుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు
