స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: రఘునాథపల్లి మండల కేంద్రంలోని ఖిలాషాపురం రోడ్డు సమీపంలో శనివారం తెల్లవారుజామున ఓ ఆటో డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడు బోయిగూడెం, ఇప్పగూడెం గ్రామాలకు చెందిన వ్యక్తిగా స్థానికులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

