ఏసీబీ ట్రాప్ లో ఇంచార్జ్ ఎంఈఓ.., స్కూల్ అసిస్టెంట్..
స్పాట్ వాయిస్, క్రైమ్: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యపురంలోని ఓ పాఠశాల నుంచి పదవివిరమణ పొందబోతున్న ఉపాధ్యాయుడి నుంచి రూ.15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఇంచార్జీ ఎంఈఓ రవికుమార్, అతనికి అసిస్టెంట్ గా పనిచేస్తున్న అయోధ్యపురం హైస్కూల్ స్కూల్ అసిస్టెంట్ చంద్రమౌళిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు.

