స్పాట్ వాయిస్, వరంగల్: గుండు సుధారాణికి కుడా చైర్మన్ పదవి విషయంలో తాము సహకరించామని కొండా సురేఖ తెలిపారు. అవిశ్వాస తీర్మానం పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు సుధారాణి కోరడంతో దాన్ని నిలిపివేశామని చెప్పారు. అనంతరం కుడా చైర్మన్ పదవి వస్తుందో లేదో అన్నది రాసి ఇవ్వాలని కోరగా, తాము ఉదారంగా వ్యవహరించామని వ్యాఖ్యానించారు. పదవి వచ్చిన తర్వాత కనీసం తమకు ఫోన్ కూడా చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయాల్లో పదవులు వచ్చిన తర్వాత గతంలో అండగా నిలిచిన వారిని మర్చిపోవద్దని పరోక్షంగా సూచించారు.