SPOT VOICE
Newspaper Banner
Date : 13 September 2026, 4:26 pm Posted By : SPOT VOICE MEDIA

బూజుపట్టిన దిల్‌పసంద్ విక్రయం

స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: వర్ధన్నపేట పట్టణం లోని ఓ బేకరీలో బూజుపట్టిన దిల్‌పసంద్ విక్రయించిన ఘటన కలకలం రేపింది. మైనార్టీ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు సత్యగణపతి బేకరీ నుంచి కొనుగోలు చేసిన దిల్‌పసంద్‌లో బూజు గుర్తించారు. పట్టణంలోని బేకరీల్లో నాణ్యత లేని ఆహార పదార్థాల విక్రయంపై ఆరోపణలు వస్తున్నా ఫుడ్‌ సేఫ్టీ తనిఖీలు నామమాత్రంగా ఉన్నాయని స్థానికులు విమర్శించారు. అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.