SPOT VOICE
Newspaper Banner
Date : 13 September 2026, 7:36 pm Posted By : SPOT VOICE MEDIA

కడియం శ్రీహరిపై కొండా సురేఖ ఫైర్

స్పాట్ వాయిస్ ,వరంగల్: తాను వరంగల్‌లో గెలిచిన తర్వాత కొద్దిరోజులకే కడియం శ్రీహరి తనతోపాటే టీఆర్‌ఎస్‌లోకి వచ్చి ఎమ్మెల్సీ పదవి తీసుకున్నారని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎక్కువ రోజులు ఆగకుండా మళ్లీ ఆ పార్టీ జెండాతో వరంగల్‌కు వచ్చారని విమర్శించారు. ఇప్పుడు కొందరు నాయకులు తామే ఇక్కడ పుట్టి పెరిగినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో తమ పాత్రను మరిచి మాట్లాడటం సరికాదన్నారు. తన రాజకీయ ప్రస్థానం, వరంగల్‌లో తన కుటుంబానికి ఉన్న ప్రజా సంబంధాలను ప్రస్తావిస్తూ ప్రత్యర్థులకు సురేఖ గట్టి కౌంటర్ ఇచ్చారు.