మిస్సింగ్‌ కేసు.. మర్డర్‌ మిస్టరీ ఛేదింపు 

పెళ్లి పేరుతో బళ్లారికి రప్పించి హత్య..  మృతదేహాన్ని ముక్కలుగా నరికిన నిందితుడు అరెస్ట్‌  స్పాట్‌ వాయిస్‌, హసన్‌పర్తి: హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన మహిళ అదృశ్యం కేసు దారుణ హత్యగా తేలింది. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బళ్లారి జిల్లా గుడుదూరుకు చెందిన వొద్దిరాజుల బసవరాజు(27)ను నిందితుడిగా గుర్తించి శుక్రవారం అరెస్ట్‌ చేశారు. హసన్‌పర్తికి చెందిన తౌటం స్వప్న(40) మే 15న అదృశ్యమైంది. ఆమె తండ్రి అమంచ రాజేందర్‌ ఫిర్యాదుతో మే 31న ఎస్సై బి.సుజిత్‌ మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు...