రూ.20 లంచం… 30 ఏళ్ల న్యాయ పోరాటం
సుప్రీంకోర్టులో ఊరట! ఇద్దరు గుజరాత్ ఉద్యోగులకు క్లీన్చిట్ ఆధారాలు లేవని కేసు కొట్టివేత స్పాట్ వాయిస్, డెస్క్ : రూ.20.. పెద్ద మొత్తం కాదు. కానీ ఆ రూ.20 చుట్టూ మొదలైన ఓ లంచం కేసు ఏకంగా 30 ఏండ్లపాటు న్యాయస్థానాల్లో నడిచింది. చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో ఈ కేసుకు తెరపడింది. లంచం డిమాండ్ చేశారనే విషయం పక్కాగా నిరూపితం కాకుండా, కేవలం రూ.20 స్వాధీనం చేసుకున్నారన్న కారణంతోనే శిక్ష విధించలేమని స్పష్టం చేస్తూ గుజరాత్ ప్రభుత్వానికి చెందిన ఓ క్లర్క్, ఓ ప్యూన్ను...