మొబైల్ ద్వారానే క్షణాల్లో పూర్తి చేసుకోవచ్చు
దేశవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. రేషన్ కార్డుదారులు తమ మొబైల్ ఫోన్ ద్వారానే సులభంగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
ముందుగా మొబైల్లో ఆధార్ ఫేస్ ఆర్డీ, మేరా ఈ-కేవైసీ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం మేరా ఈ-కేవైసీ యాప్లో రాష్ట్రాన్ని ఎంపిక చేసి **‘ప్రొసీడ్’**పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్ను నమోదు చేసి, ఓటీపీ ద్వారా ధ్రువీకరణ పూర్తి చేయాలి.
అనంతరం క్యాప్చా నమోదు చేస్తే రేషన్ కార్డులోని సభ్యుల వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి. అక్కడ ‘ఫేస్ ఈ-కేవైసీ’ ఆప్షన్ను ఎంచుకోవాలి. కెమెరా ముందు ముఖాన్ని చూపించిన వెంటనే ముఖ గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుంది. ఈ-కేవైసీ విజయవంతంగా పూర్తయినట్లు స్క్రీన్పై సందేశం కనిపిస్తుంది.
ఇక రేషన్ కార్డు ఈ-కేవైసీ కోసం తప్పనిసరిగా మీ-సేవ కేంద్రం లేదా రేషన్ దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, మొబైల్ ద్వారానే ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.