SPOT VOICE
Newspaper Banner
Date : 21 August 2026, 9:59 am Posted By : SPOT VOICE MEDIA

పదిమంది ఏఎస్ఐలకు ఎస్సైలుగా ప్రమోషన్

స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: పోలీస్ శాఖలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏఎస్ఐలకు ఎట్టకేలకు ప్రమోషన్ లభించింది. శాఖ ఉత్తర్వుల మేరకు పదిమంది ఏఎస్ఐలకు ఎస్సైలుగా పదోన్నతి కల్పించారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఏఎస్ఐలుగా విధులు నిర్వహిస్తున్న 22 మందికి ఇటీవల కరీంనగర్‌లో శిక్షణ ఇచ్చారు. తాజాగా వారిలో పదిమందికి ఎస్సైలుగా ప్రమోషన్ లభించగా, త్వరలోనే పోస్టింగ్‌లు కేటాయించనున్నట్లు సమాచారం.