SPOT VOICE
Newspaper Banner
Date : 20 August 2026, 12:17 pm Posted By : SPOT VOICE MEDIA

బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే గండ్ర పరామర్శ

స్పాట్ వాయిస్, ​గణపురం: మండలంలోని లక్ష్మారెడ్డిపల్లి, కర్కపల్లి గ్రామాల్లో పలువురు బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరామర్శించారు. లక్ష్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామిడి ప్రకాష్ రెడ్డి తల్లి రామిడి రాధమ్మ ఇటీవల మృతి చెందగా, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ​అనంతరం అదే గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఏడెల్లి మల్లారెడ్డి ఇటీవల కాలి శస్త్రచికిత్స చేయించుకోగా, అలాగే కర్కపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు దేవిశెట్టి రాంనర్సింహారావు కాలికి గాయం కావడంతో వారిని పరామర్శించి త్వరగా కోలుకోవాలని మనోధైర్యం కల్పించారు. ​ఈ కార్యక్రమంలో ఆయన వెంట గణపురం పీఏసీఎస్ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, వార్డు సభ్యులు వీరగోని గోపి, జక్కుల కొమురయ్య, ఒద్దుల సబిత-లక్ష్మారెడ్డి, నాయకులు కంచరకుంట్ల రవీందర్ రెడ్డి, వీసం భరత్ రెడ్డి, మొగిలి శ్రీనివాస్, వీరగోని రవి, అబ్బు కుమార్ రెడ్డి, మార్క వేణుగోపాల్, జన్ను సుమన్ తదితరులు ఉన్నారు.