స్పాట్ వాయిస్, బ్యూరో : 15 ఏళ్లుగా వృత్తిధర్మం కారణంగా దూరంగా ఉంటున్న తమ్ముడు ప్రేమ్సాగర్కు ఈసారి చెల్లెళ్లు నవ్యశ్రీ, దివ్యశ్రీ స్వయంగా రాఖీ కట్టారు. CISF కానిస్టేబుల్గా నాసిక్, దంతేవాడ, బిలాస్పూర్లో సేవలందించిన ప్రేమ్సాగర్కు జైపూర్లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కు పోస్టింగ్ రావడంతో కుటుంబానికి చేరువయ్యారు. రామగుండం NTPCలో పనిచేస్తున్న అన్నలతో కలిసి రాఖీ వేడుకలు జరుపుకోవడంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.