బోల్తా పడిన ఆపిల్ పండ్ల డీసీఎం..:నిమిషాల్లో లూటీ

స్పాట్ వాయిస్,  తొర్రూరు: మానుకోట జిల్లా తొర్రూరు మండలం మాటేడు స్టేజి సమీపంలో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు నిమిషాల్లోనే వాహనంలోని ఆపిల్ పండ్లను ఎత్తుకెళ్లడంతో లూటీ జరిగింది. పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు. [video width="848" height="478" mp4="https://spotvoice.in/wp-content/uploads/2026/07/VID-20260730-WA0081.mp4"][/video]