స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి K. T. Rama Rao సోమవారం సాయంత్రం హైదరాబాద్కు వెళ్తూ మార్గమధ్యంలో రఘునాథపల్లిలో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా తాటి బెల్లం టీ తాగుతూ పార్టీ కార్యకర్తలతో సరదాగా గడిపారు. కేటీఆర్ రాకతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కార్యకర్తలు ఆయనతో ఫొటోలు దిగుతూ.. ఆనందపడ్డారు.