SPOT VOICE
Newspaper Banner
Date : 31 May 2026, 10:43 pm Posted By : SPOT VOICE MEDIA

మాజీ ఎమ్మెల్యే గండ్ర పరామర్శ..

స్పాట్ వాయిస్, శాయంపేట : శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన మండల ప్రజా పరిషత్ మాజీ కో ఆప్షన్ మెంబర్ మొహిబుద్దీన్ సోదరుడు మొయినుద్దీన్ ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పెద్దకోడెపాకకు వెళ్లి, ఆయన మృత దేహాంపై పూలమాల వేసి నివాళులర్పించారు. మొహిబుద్దీన్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట మండల బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.