SPOT VOICE
Newspaper Banner
Date : 08 May 2026, 10:03 am Posted By : SPOT VOICE MEDIA

రఘునాథ్ పల్లిలో వరుస దొంగతనాలు..

భయాందోళనలో ప్రజలు..

స్పాట్ వాయిస్, రఘునాథ్ పల్లి : వరుస దొంగతనాలు జరుగుతుండడంతో రఘునాథ్ పల్లి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బుధ, గురువారం రఘునాథపల్లి మండల కేంద్రంలోశివాజీ నగర్, బానాజీపేట గ్రామంలో దొంగలు పడ్డారు. శివాజీ నగర్ గ్రామానికి చెందిన పెద్ది కుమార్ ఇంట్లో 65 వేల విలువగల బంగారం, బానా జీపేట గ్రామానికి చెందిన సత్యమ్మ ఇంట్లో 35 విలువ బంగారం, రఘునాథ్ పల్లి మండల కేంద్రం చెందిన సుధాకర్ రెడ్డి ఇంట్లో ల్యాప్ ట్యాప్ దొంగలు ఎత్తుకుపోయినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల వరుస గా దొంగలు రెచ్చిపోతుoడడo తో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.