బీసీ రాజ్యాధికార వేదిక పాదయాత్రకు బీసీల మద్దతు..
చట్టసభల్లో బీసీల సత్తా చాటాలి…
బీసీ రాజ్యాధికార వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్
స్పాట్ వాయిస్, రఘునాథ్ పల్లి :బీసీల బతుకులు మారాలని యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలని, బీసీల సత్తా చాటేందుకు చేపట్టిన పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది.. గురువారం రఘునాథ్ పల్లి మండల కేంద్రంలో పాదయాత్రకు మాజీ ఎంపీపీ వై కుమార్ గౌడ్, జనగామ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ ఆంజనేయులు గౌడ్, సీనియర్ జర్నలిస్టు, బీసీ రాజ్యాధికార సమితి జనగామ జిల్లా ప్రచార కార్యదర్శి చింతకింది కృష్ణమూర్తి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేపడుతున్న రాఘవేందర్ గౌడ్ కు ఘనంగా సన్మానం చేశారు.
