హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ప్రమాదo..
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి : రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రెండు లారీలు ఢీకొన్నాయి. ఇసుక లారీ వేగంగా వెళ్లి పత్తి బెల్ల లారీని ఢీకొనడంతో రెండు వాహనాలు కిందపడిపోయాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఘటనతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.