SPOT VOICE
Newspaper Banner
Date : 08 April 2026, 10:06 am Posted By : SPOT VOICE MEDIA

రఘునాథ్ పల్లిలో మళ్ళీ దొంగలు..

రఘునాథ్ పల్లిలో మళ్ళీ దొంగలు..
* గ్యాస్ సిలిండర్, విలువైన వస్తువులు దొంగతనం
* వారం రోజుల్లో రెండో ఘటన

స్పాట్ వాయిస్, రఘునాథ్ పల్లి: హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారుల గల రఘునాథపల్లి మండల కేంద్రంలోని ఆర్విఎస్ కాంప్లెక్స్ ప్రక్కన ఉన్న మాను పాటి సోమలక్ష్మి ఇంట్లో మధ్య రాత్రి దొంగలు పడినట్లు సమాచారం… వారు బంధువుల ఇంటికి వెళ్లగా.. ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన దొంగలు డోర్లు పగులగొట్టి ఇంటిలో ఉన్న బీరువాలోని విలువైన వస్తువులు, గ్యాస్ సిలిండర్ ను కూడా ఎత్తుకు పోయినట్లు తెలిసింది.


సంఘటన స్థలానికి రఘునాథపల్లి సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ యాదవ్ చేరుకొని పరిశీలించి వివరాలు తెలుకుని దర్యాప్తు చేపట్టారు. గత వారంలో సెల్ టవర్ దగ్గర కూడా దొంగలు పడి నాలుగు బ్యాటరీలు ఎత్తుకెళ్లారు.