స్పాట్ వాయిస్, క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఇన్ స్పెక్టర్లుకు డీఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో హన్మకొండ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న గొర్ల సీతారెడ్డి, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ సార్ల రాజు, ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ స్పెక్టర్ బోలగాని శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 మంది ఇన్ స్పెక్టర్లకు డిఎస్పీలుగా పదోన్నతి లభించింది.
