వరంగల్ కు ప్రధాని మోదీ..?
మామునూర్ ఎయిర్ పోర్ట్ శంకుస్థాపన.. భద్రకాళి అమ్మవారి ఆలయం దర్శనం.. ఎస్పీజీ, ఆక్టోపస్ ఆలయం పరిశీలన.. స్పాట్ వాయిస్, వరంగల్: వరంగల్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలోనే రానున్నారన్న వార్తల నేపథ్యంలో నగరంలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రసిద్ధి చెందిన భద్రకాళి ఆలయం పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రధాని పర్యటనలో భాగంగా అమ్మవారిని దర్శించుకునే అవకాశమున్నట్లు అధికార వర్గాలు సూచిస్తున్నాయి. ఇదే సమయంలో మామునూరు ఎయిర్పోర్టు (మామునూరు ఎయిర్పోర్టు) అభివృద్ధికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం కూడా ఉండొచ్చని సమాచారం. ఈ ఎయిర్పోర్టు పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం...