చికిత్స పొందుతూ యువకుడు మృతి..
చికిత్స పొందుతూ యువకుడు మృతి.. కిలాషాపురం లో విషాద ఛాయలు.... స్పాట్ వాయిస్, రఘునాథ్ పల్లి : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కిల షాపురం గ్రామానికి చెందిన తాడూరు నరేష్(42) అనే యువకుడు శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు.. గ్రామస్తుల కథనం ప్రకారం నరేష్ మూడు రోజుల నుంచి షుగర్ పెరగడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడికి భార్య కుమారుడు కూతురు ఉన్నారు. దీనితో అందరితో కలిసిమెలిసి ఉండే నరేష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.