అక్రమంగా మొరం తరలిస్తున్న రెండు టిప్పర్లు పట్టివేత

స్పాట్ వాయిస్, దామెర : దామెర మండల పరిధిలోని పులుకుర్తి గ్రామ శివారు నుంచి ఆదివారం రెండు టిప్పర్ లలో ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా మొరం తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న దామెర ఎస్సై కొంక అశోక్ తనిఖీ చేసి లారీలను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు అక్రమంగా మొరం తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.