SPOT VOICE
Newspaper Banner
Date : 24 March 2026, 9:29 am Posted By : SPOT VOICE MEDIA

నరేందర్ రెడ్డి మృతితో స్టేషన్ ఘనపూర్ లో విషాదఛాయలు…

నరేందర్ రెడ్డి మృతితో స్టేషన్ ఘనపూర్ లో విషాదఛాయలు…

స్పాట్ వాయిస్, రఘునాథ్ పల్లి: నాలుగు దశాబ్దాల పాటు ప్రజలకు సేవలు అందించి నిరంతరం అందుబాటులో ఉంటూ గతంలో టిడిపి.. బీఆర్ఎస్… కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ అందరినీ ఎమ్మెల్యే చేసిన చరిత్ర నరేందర్ రెడ్డిది.. స్టేషన్గన్పూర్ మున్సిపల్ చెందిన చింతకుంట్ల నరేందర్ రెడ్డి అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్స పొంది మృతి చెందాడు. ఆయన మృతితో స్టేషన్ ఘనపూర్ లో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతి పట్ల మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తాటికొండ రాజయ్య, జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు సంతాపం తెలిపారు.