గ్రామీణ వైద్యులపై పోలీస్ స్టేషన్ లో కేసు..
గ్రామీణ డాక్టర్లలో టెన్షన్…టెన్షన్…
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: రఘునాథపల్లి మండల కేంద్రంలో ఎలాంటి అనుమతి లేకుండా వైద్య సేవలు అందిస్తూ ఆసుపత్రి నిర్వహిస్తున్న గ్రామీణ వైద్యులు (ఆర్ఎంపీ) ఇద్దరిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. జనగామ జిల్లా డిఎంహెచ్వో ఆదేశాల మేరకు వైద్యాధికారులు తనిఖీ నిర్వహించారు. ఎలాంటి అనుమతి లేకపోవడంతో రఘునాథపల్లి మండల కేంద్రమైన చెందిన ఆర్ఎంపీ డాక్టర్ చిoతకింది సత్యనారాయణ, అరుణ్ కుమార్ పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. దీంతో గ్రామీణ వైద్యులు టెన్షన్ నెలకొంది.
